25-07-2025 02:33:58 PM
చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో గల లింగాపురం గ్రామానికి చెందిన మైపా నీలయ్య (58) దినసరి కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి - భార్య భర్తలు కలిసి కూలీనాలి చేసుకొని జీవిస్తున్న క్రమంలో పక్షవాతం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏర్పడింది,ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి, పలువురు దాతల నుంచి సేకరించిన రూ 7వేలను శుక్రవారం చర్ల లోని మీకోసం మేమున్నాం కార్యాలయంలో దొడ్డి తాతారావు మాష్టారు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలా ఓ చేయి వేసి సహాయమందిస్తే పెద్ద పుణ్యకార్యమని, ప్రతీ ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ విధమైన సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు, పంజా రాజు, కవ్వాల రాము, దొడ్డ ప్రభుదాస్, గాదెరాజు ప్రసాద్, మడిపల్లి ప్రవీణ్, దొడ్డి రామ్మోహన్, జట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు