పీఆర్టీయూ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ
11-03-2026 01:00 AM
తాడ్వాయి, మార్చి 10(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం దేమికలాన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పి.ఆర్.టి.యు తెలంగాణ క్యాలెండర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్య ప్రకాష్, ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ.. పి ఆర్ టి యు తెలంగాణ ఉపాధ్యాయుల పక్షాన నిలిచి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పి ఆర్ టి యు తెలంగాణ ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహించి మెరుగైన విద్యా బోధనకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, ఉపాధ్యాయులు ప్రతాపరెడ్డి, సుధాకర్, రాధా,భాస్కర్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.




