calender_icon.png 25 November, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

25-11-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి,  స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు తో  కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 58  అర్జీలను స్వీకరించారు. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 41, గ్రామీణాభివృద్ధి శాఖ 4, జిల్లా సంక్షేమ శాఖ 2, మున్సిపాలిటీ 2,ఆర్ అండ్ బి, ఎక్సైజ్, ఇరిగేషన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా పంచాయతీ, సివిల్ సప్లై, ఆర్టీసీ, ఎంప్లాయిమెంట్ టీం, విద్య  శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.

వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, హౌసింగ్ పీడీ విజయ సింగ్ ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.