calender_icon.png 7 June, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులు లేక జనం పరేషాన్

06-06-2025 08:04:10 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో శుక్రవారం బస్సులు(Buses) లేక జనం ప్రయాణానికై ప్రయాసలు పడాల్సి వచ్చింది. శుక్రవారం ఆలేరు నియోజకవర్గం(Aleru Constituency)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభ ఉండడంతో ఆర్టీసీ బస్సులన్నీ సభకు తరలించడం జరిగింది. దీంతో బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు పడాల్సి వచ్చింది. బస్సులు సరిగా లేకపోవడంతో జనం తప్పనిసరి అయి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణించారు. బస్సులు లేకపోవడంతో వలిగొండ మండల కేంద్రంలో బస్సు కోసం వేచి చూస్తున్నా వారి గుంపులు, గుంపులుగా కనిపించారు.