06-06-2025 07:58:19 PM
నాగారం: నాగారం మండలం, పసునూర్ గ్రామంలో బడిబాటలో భాగంగా గ్రామసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశమును ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు మాట్లాడుతూ... మోడల్ స్కూల్ గత విద్యా సంవత్సరం ఫలితాలు చర్చించుతూ ఈ ఫలితాల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ముందంజ ఉన్నారు. అదేవిధంగా బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిల్లో చేర్పించాలి అని అన్నారు . ప్రవేట్ స్కూల్ కి పంపుతున్న విద్యార్థులు తల్లిదండ్రులను కలిసి మోడల్ స్కూల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు నాణ్యమైన ఉచిత విద్య పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం ఉచిత యూనిఫామ్ పుస్తకాలు విశాలమైన ఆటస్థలం ఉంది మోడల్ స్కూల్లో విద్యార్థులను చేర్పించండి అన్నారు. మండలంలోని బడి ఈడు పిల్లలందరినీ మోడల్ స్కూల్ లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సూర్యకాంతం- సంపత్ ఉపాధ్యాయులు ,గ్రామ పెద్దలు , గ్రామ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు .