14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై విషప్రచారం

07-10-2024 03:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి నాగేశ్వరరావుకు ప్రజలు 95 ఆర్జీలు ఇచ్చారు. అందులో భూసమస్యలు, ఉద్యోగాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లపై అధిక ఆర్జీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

కొన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్ల నాగేశ్వరరావు వెల్లడించారు. గాంధీభవన్ కు వస్తే సమస్యలు తీరుతాయని ప్రజలు వస్తుంటే, కొందరు బీఆర్ఎస్ నాయుకులు మాత్రం పనికట్టుకొని కావాలనే ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రుణమాఫీలో ప్రపంచాన్ని మోసం చేసిందని, ఇప్పటివరకు 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.