1 July, 2026 | 10:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వక్ఫ్ బిల్లుపై 19న బహిరంగ సభ

14-04-2025 02:00 AM
  1. ముస్లిం హక్కుల పరిరక్షణకు కృషి
  2. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవ ల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్‌లోని దరుస్సలాంలో  ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వక్ఫ్ బిల్లు కు ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల హక్కు లు హరిస్తాయని, అందుకే బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు.

ముస్లిం హక్కుల పరిరక్షణకు ఎంఐఎం కట్టుబడి ఉందని, ఈ మేరకు తమ పార్టీ  పనిచేస్తుందని వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు, ఎంఐఎం నేత లు పాల్గొంటారని వెల్లడించారు.