16 April, 2026 | 12:03 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

18-11-2025 12:22 AM

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:17ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే  పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 160 అర్జీలు అందాయి. ప్రజలు తమ సమస్యలు అధికార యంత్రాంగం ద్వారా తప్పక పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని అదనపు కలెక్టర్ అన్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.