28 April, 2026 | 1:59 AM

ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలి

28-04-2026 12:00 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి, ఏప్రిల్ 27 ( విజయక్రాంతి ) : యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని కనిమెట్ట, కానాయిపల్లి, పాలెంతో పా టు కొత్తకోట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పా టు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

అదేవిధంగా ఆయా సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న తీరును పరిశీలించి, సెంటర్ల ఇన్చార్జిలకు పలు కీలక సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యాన్ని సక్రమంగా పరిశీలించి కొనుగో లు చేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, కొత్తకోట తహసిల్దార్, ఇతర అధికారులు తదితరులు అదన పు కలెక్టర్ వెంట ఉన్నారు.