10-11-2025 07:01:14 PM
నిర్మల్ రూరల్: వరి ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర కల్పించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి అన్నారు. సోమవారం మామడ సోన్ మండలంలోని వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలను వేగంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక నాయకులు ఉన్నారు.