calender_icon.png 13 June, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా భోదన

12-06-2025 08:58:25 PM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్..

నడిగూడెం: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్(Agricultural Market Committee Chairperson Vepuri Tirupathamma Sudheer) అన్నారు. గురువారం మండల కేంద్రంలో  జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా  నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ... కొల్లు పాపయ్య చౌదరి ఎంతో మంది పేద విద్యార్థుల చదువు కొరకు 12 ఎకరాల భూమిని దానం చేసి పాఠశాల నిర్మించి ఎంతోమంది విద్యార్థులు చదువుకొని వారి జీవితాల వెలుగు నింపుకోవడానికి  కారణమయ్యారన్నారు. 

ఉచిత విద్య మంచి భోజనం విశాలమైన ఆట స్థలం ఉచిత పాఠ్యపుస్తకాల తోపాటు దుస్తులు ప్రభుత్వ అందిస్తుందని పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని చదువుతో పాటు మెళుకువలు నేర్పుతారని తెలిపారు.  ప్రవేటు పాఠశాలను కళాశాలను నమ్మి లక్ష రూపాయలు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నత శిఖరాలలో ఉన్నారని తెలిపారు.  ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని నినదించారు ఎంతో చరిత్ర గలిగిన పాఠశాలలో  విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఆమె పూర్వ విద్యార్థులకు  తల్లిదండ్రులకు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ డిప్యూటీ తహసిల్దార్  ప్రియదర్శిని శోభన్ బాబు,మీరాజుద్దీన్, కత్తి వెంకటేశ్వర్లు, శ్రీదేవి, అహల్యదేవి, పర్వతాలు, వి ఎల్ ఎన్  చారి, వేంకటేశ్వర్లు, వీరబాబు తదితరులు ఉన్నారు.