calender_icon.png 13 June, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాను సందర్శించిన అప్మెల్ ఎండి నాగరాజు

12-06-2025 08:55:32 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి అనుబంధ సంస్థ అప్మెల్ ఎండి నాగరాజు(MD Nagaraju) ఏరియాలో పర్యటించారు. గురువారం ఏరియా పర్యటనలో భాగంగా జిఎం కార్యాలయంకు రాగా ఏరియా జిఎం జి దేవేందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 30వ తేదీన పదవి విరమణ పొందబోతున్న సందర్భంగా అప్మెల్ ఎండిని ఘనంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడారు. ప్రతి ఒక్క అధికారికి పదవి విరమణ అనివార్యం అని, పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ ఎజిఎం ఈఅండ్ఎం వెంకట రమణ, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఎస్ఇ  ఐఇడి కె కిరణ్ కుమార్ డీజీఎం ఎఫ్అండ్ఎ ఆర్విఎస్ ఆర్కే ప్రసాద్, ఏరియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.