రమాదేవి సేవలు చిరస్మరణీయం
టీఎస్టిబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా సేవలందించి, జాయింట్ డైరెక్టర్గా పదవీ విరమణ పొందిన ఆర్. రమాదేవి సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TSTWTU) జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమెకు శాలువా, బొకే అందజేసి, ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె చేపట్టిన కార్యక్రమాల ఫొటోలతో రూపొందించిన ప్రత్యేక ఫొటో ఫ్రేమ్ను బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రమాదేవి విశేష కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.






