21 July, 2026 | 7:15 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

రైల్వే అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకే

18-10-2024 02:43 AM

120 నుంచి తగ్గించిన ఐఆర్‌సీటీసీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణికులకు 120 రోజుల ముందుగా తమ ప్రయాణాలను రిజర్వ్ చేసుకొనే సదుపాయం ఉండగా తాజాగా దాన్ని 60 రోజులకు తగ్గించింది. గతంలో రైల్వే ముందస్తు బుకింగ్ ప్రయణానికి 60 రోజుల ముందే ఉండేది. దాన్ని 120 రోజులకు పెంచిన భారతీయ రైల్వే.. తాజాగా గతంలో ఉన్న వ్యవధికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

2024, నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అక్టోబర్ 31 వరకు ఉన్న బుకింగ్స్‌కు సంబంధించి పాత నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది. కాగా గోమతి, తాజ్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎలాంటి మా ర్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్‌కు తక్కువ వ్యవధి ఉంది.

విదేశీ పర్యాటకులకు మాత్రం 365 రోజుల ముందే టికెట్ బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండగా ఇందులో మార్పు చే యలేదు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ షేర్ విలువ 2 శాతం మేర క్షీణించి రూ.873 వద్ద కొనసాగుతున్నది. గడువు కుదింపు వల్ల ఆ మేర క్యాన్సిలేషన్లు తగ్గి ఐఆర్‌సీటీసీకి ఆదా యం తగ్గే అవకాశం ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.