29-05-2025 03:24:36 PM
ముంబై: గత ఐదు రోజుల్లో మహారాష్ట్రలో(Maharashtra) కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం, చెట్లు లేదా నిర్మాణాలు కూలిపోవడం వంటి వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా పదహారు మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రుతుపవనాలు(Southwest monsoon) ప్రారంభమైనందున మే 24 నుండి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి.
భారీ వర్షాల(Heavy rains) కారణంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. పూణే జిల్లాలో ముగ్గురు, థానే, లాతూర్, భండారాలో ఇద్దరు చొప్పున మరణించారు. రాయ్గడ్, అహల్యానగర్, నాగ్పూర్, వార్ధా, చంద్రపూర్, ముంబై సబర్బన్, గోండియా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మే 24 నుండి వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 18 మంది గాయపడ్డారని నివేదికల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర వాతావరణ సంఘటనలలో 41 జంతువులు మరణించాయని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.