29-05-2025 10:40:13 AM
కాసేపట్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన
హైదరాబాద్: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల(Gaddar Telangana Film Awards) ప్రకటిస్తున్నారు. ఈ మేరకు గురువారం గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ప్రముఖ సీనియర్ నటి జయసుధ కలిసి గద్దర్ ఫిల్మ్ అవార్డులను వెల్లడిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత అవార్డులను జయసుధ ప్రకటించారు. 11 కేటగిరీలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 కాలానికి అవార్డులను ప్రకటించారు.
ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వనుంది. 2024కు సంబంధించి అన్ని కేటగిరిల్లోనూ అవార్డులను ప్రకటించనున్నారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు అవార్డుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 21 మందికి వ్యక్తిగత అవార్డులు దక్కనున్నాయి. వ్యక్తిగత అవార్డులతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులు ప్రకటించనున్నారు. ఎన్టీఆర్, పైడి జయరామ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులను ప్రకటించనున్నారు.