20 August, 2026 | 3:13 PM

విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ

20-08-2026 02:40 PM

నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

పటాన్ చెరు, ఆగస్టు 20 :  ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని  ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం విమానయానం టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు.

దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతమన్నారు. భారతదేశ  అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధిలో నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్, నాయకులు అశోక్, శ్రీనివాస్, వీరేష్, అనిల్, రాజ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.