28-05-2025 12:19:52 AM
-10 నుంచి 15 వరకు శిక్షణా కార్యక్రమాలు
-15 తర్వాత రాజీవ్ యువవికాసం లబ్ధిదారులకు నిధుల పంపిణీ
-గాంధీ జయంతి నాటికి 5 లక్షల మందికి స్వయం ఉపాధి
-హై లెవెల్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్ష న్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిపై మంగళవారం డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశా రు. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ర్టవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ ఉంటుం దని చెప్పారు.
జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గస్థాయిలో రాష్ట్రవ్యాప్తం గా ఒకేసారి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. గాంధీ జ యంతి అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా నిర్దేశించుకున్న 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతినెలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేలా అవకా శం ఇవ్వాలని కోరుతున్నారని భట్టి విక్రమార్క చెప్పారు.
రాజీవ్ యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ల చైర్మన్లకు రాజీవ్ వికాసం కింద అవకాశం కల్పించాలంటూ యువత దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నిటినీ పరిశీలించి, సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
గత పదేండ్లలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాల కు అందిన మొత్తాన్ని, ప్రజా ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాదిలోనే రాజీవ్ యువ వికాసం ద్వారా అందిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డని, ఏ రాష్ర్టంలోనూ ఒక సంవత్సరం లో స్వయం ఉపాధి కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు.
ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు వారం క్రిత మే సమావేశం నిర్వహించామని, ఆ తర్వాత సంక్షేమ శాఖ అధికారులు, బ్యాంకర్లతో తర చూ మాట్లాడుతూ పథకాన్ని తుది అంకానికి చేర్చారని ఆయన అభినందించారు. వెంటనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జూన్ 2న సాక్ష్యం లెటర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అవసర మయ్యే అన్నీ చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
హై లెవెల్ కమిటీ సమావేశం లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శా ఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పె షల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
సంబురాలు అంబరాన్ని తాకాలి..
తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాల సంబురాలు అంబరాన్ని తాకేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకో వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన తర్వాత, పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జెండా వందనం, మార్చ్ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా కేంద్రాల్లో ఇన్చార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్లోనూ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ర్ట అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ మూలంగా గతేడాది అనుకున్న స్థాయిలో వేడుకలు నిర్వహించలేకపోయామని, ఈసారి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తుంటారని చెప్పారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్లు వికాస్రాజ్, రఘునందన్రావు, సమాచార శాఖ కమిషనర్ హరీశ్, పోలీస్ అధికారులు సివీ ఆనంద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.