ఇస్మార్ట్.. రీస్టార్ట్..!

05-05-2024 12:20:00 AM

రామ్ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. 2019లో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఇది రెండో భాగం. ఇటీవల ఈ చిత్రం బృందం ముంబై చేరుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేసిన ఇస్మార్ట్ టీమ్, ముఖ్య తారాగణంపై ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీ కరించనున్నట్టు తెలిపారు. ఈ షెడ్యూల్‌కి సంబంధించి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం వాటి ఫోటోలను కూడా ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. సినిమా మొదలై చాలా కాలం గడుస్తున్నా ‘ఇస్మార్ట్’ టీమ్ నుండి ఎలాంటి కబురు లేకపోవడం కొంత చర్చకు దారితీయగా, ఈ ప్రకటన వాటన్నిటికీ బదులు పలికంది. మరో పది రోజుల్లో రామ్ పుట్టిన రోజు (మే 15) నాడు టీజర్ రూపంలో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అభిమా నులకు ట్రీట్ ఇవ్వనుందని సమాచారం.