17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బుగ్గలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం..!

06-04-2025 05:14 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాములోరి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. బెల్లంపల్లి మండల సీనియర్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరిస్వామి దంపతులు, మాజీ దేవాలయ చైర్మన్, బుగ్గ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాస్ ఆడి శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు సతీష్ శర్మ వేదమంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు హనుమాన్ భక్తులు,మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం అనంతరం బుగ్గ దేవాలయంలో భక్తులకు నాతరి స్వామి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కన్నాల మాజీ సర్పంచ్ జిల్లెపల్లి స్వరూప, నాయకులు మాసాడి శ్రీరాములు, అన్నదాన ట్రస్ట్ సభ్యులు రాజేశం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.