16 March, 2026 | 11:45 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక: ఎస్సై బాబు

16-03-2026 06:59 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో 2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హుమేరా మస్జిద్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మఠంపల్లి ఎస్సై పి.బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ను నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిములు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారని తెలిపారు. రంజాన్ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ కరీం,2వ వార్డ్ నంబర్ సయ్యద్ వహాబ్, గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ రహీం, రిజ్వాన్, మౌలానా సయ్యద్ షకీల్, షేక్.బాబు, తదితరులు పాల్గొన్నారు.