02-01-2026 01:18:16 AM
మంథని, జనవరి1(విజయక్రాంతి): మంథని మండలంలోని ఖానాపూర్ ఖాన్ గ్రామాల శివారులోని ముసళ్ళ అభయారణ్యం ఎల్మడుగులో గురు వారం ఉదయం అరుదైన సముద్రపు చేప లభ్యమయింది. ఇది నాలుగున్నర కిలోల బరువు ఉందని, దీని పేరు శీతల్ అంటారని స్థానికులు తెలిపారు. ఈ చేప వాలుగా చేప రూపాన్ని సంతరించుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ఇలాంటి చేపల లభ్యం కావడం ఇదే మొదటిసారని అక్కడివారు తెలిపారు. వర్షాకాలం వరదల సమయంలో ఈ చేప వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.