calender_icon.png 2 January, 2026 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మొసళ్ల మడుగులో అరుదైన చేప లభ్యం

02-01-2026 01:18:16 AM

మంథని, జనవరి1(విజయక్రాంతి): మంథని మండలంలోని ఖానాపూర్ ఖాన్ గ్రామాల శివారులోని ముసళ్ళ అభయారణ్యం ఎల్మడుగులో గురు వారం ఉదయం అరుదైన సముద్రపు చేప లభ్యమయింది. ఇది నాలుగున్నర కిలోల బరువు ఉందని, దీని పేరు శీతల్ అంటారని స్థానికులు తెలిపారు. ఈ చేప వాలుగా చేప రూపాన్ని సంతరించుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ఇలాంటి చేపల లభ్యం కావడం ఇదే మొదటిసారని అక్కడివారు తెలిపారు. వర్షాకాలం వరదల సమయంలో ఈ చేప వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.