15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

యాదగిరిగుట్ట దేవాలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

02-01-2026 01:18 AM

యాదగిరిగుట్ట, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులకు పోటెత్తారు. స్వామి వారిని  మంత్రి పోన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ జాతీయ భద్రత మాస ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయని ఇందులో భద్రత అధికారులు, ప్రతి పౌరుడు ఈ రోడ్డు భద్రత మహోత్సవములో అవగాహన సదస్సులో పాల్గొనాలన్నారు.

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థిని,  విద్యార్థి వారి తల్లిదండ్రుల వద్ద ఒక హామీ పత్రం లాగా ఈ రోడ్డు భద్రత నిబంధనలను పాటిస్తామని ఒక సైనేజ్ విధానం తీసుకురావాలన్నారు. అలాగే తెలంగాణలో ప్రమాదాల తీవ్రతనీ పూర్తిగా తగ్గించాలని, ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఈయానా వెంట పలువురు అధికారులు ఉన్నారు.