6 July, 2026 | 9:40 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

తినే చట్నీ పాత్రలో ఎలుక

09-07-2024 11:08 AM

సంగారెడ్డి : తినే చట్నీ పాత్రలో ఎలుక పడిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్డీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్ లో మంగళవారం చోటు చేసుకుంది. మూత పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో ఎలుక పడినట్లు కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్నీలో ఎలుక ఘటనపై జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ స్పందన స్పందించారు.

తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని  ప్రిన్సిపల్ అన్నారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని, పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని ఆమె పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపినట్లు ప్రిన్సిపల్ స్పందన స్పష్టం చేశారు.