దీక్ష భగ్నం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్: ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruti President) కల్వకుంట్ల కవితను మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం పోలీసులు అరెస్టు(Kalvakuntla Kavitha arrested) చేసి వాహనంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కవిత జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్లలోని వినోభా నవోదయ భూదాన్ కాలనీ నుండి బహిష్కరించబడిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి 9 గంటలకు అంబేద్కర్ భవన్లో కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
మంగళవారం ఉదయం 6 గంటలకు పోలీసులు అంబేద్కర్ భవన్కు(Ambedkar Bhavan) చేరుకున్నారు. మహిళా పోలీసులు కవితను అరెస్టు చేసి వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఖమ్మం నగర పోలీసు కమిషనర్ సునీల్ దత్(Khammam City Police Commissioner Sunil Dutt) కూడా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కూడా తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. వెలుగుమట్లలోని(Velugumatla) వినోభా నవోదయ కాలనీలోని అదే స్థలాలలో బహిష్కరించబడిన కుటుంబాలకు ఇళ్ళు తిరిగి నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. కవితతో పాటు నిరాహార దీక్ష చేస్తున్న డీఎస్పీ అధ్యక్షుడు విశారధన్ మహారాజ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.




