15 June, 2026 | 9:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి

15-06-2026 08:50 PM

బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకులు జనిగ సందీప్

హుజూర్ నగర్: అర్హులైన పేదలకు అందాల్సిన రేషన్ కార్డులను అక్రమంగా పొందిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డులను వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జనిగ సందీప్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో  ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండే అవకాశం లేకపోయినా, కొందరు అక్రమంగా వాటిని పొంది ప్రజా పంపిణీ వ్యవస్థలోని బియ్యం, ఇతర రాయితీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన పేదలకు అందాల్సిన లబ్ధి అందని ద్రాక్షలా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను రద్దు చేయాలని కోరారు. అర్హులైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.