calender_icon.png 22 June, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

21-06-2025 08:03:57 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రేషన్ కార్డు దారుల నుండి తక్కువ ధరకు కొందరు కొనుగోలు చేసి అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే సమాచారం మేరకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సూర్య తండాలో అక్రమంగా నిలువచేసిన ఓ వ్యక్తి ఇంటి వద్ద రేషన్ బియ్యాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బియ్యం నిల్వచేసినట్లుగా అనుమానిస్తున్న మహిళపై గార్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ కు తరలించి, ఈ ఘటనపై సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటీ రమేష్, ఏఎస్ఐ రవీందర్, ఎండి సిరాజ్ పాషా సిబ్బంది పాల్గొన్నారు.