21-06-2025 08:07:42 PM
వారసిగూడ (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మేరకు బిజెపి బౌద్ధ నగర్ డివిజన్ అధ్యక్షులు పి.సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో యోగా గురువు శ్రీమతి పారిజాతం శిక్షణలో ఈరోజు ఉదయం 6 గంటలకు బౌద్ధ నగర్ మెయిన్ రోడ్డు పాత అన్నపూర్ణ మెస్ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. యోగా వల్ల మనసు ప్రశాంతత దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం ప్రతి దినము మానవ శరీరాన్ని ఉత్సాహంగా ముఖ కవళికలు ఆనందంతో ఉండడానికి ఈ యొక్క యోగ ప్రయోజనం చేకూరుతుందని డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి ప్రసాద్ గౌడ్ నాగేశ్వర్ రెడ్డి కనకట్ల హరి దత్తు కొమరయ్య సారధి కుమార్ అజయ్ సంపత్ సత్యనారాయణ సుబ్బారావు సురేష్ శ్రీధర్ అగుల్ల శీను సాయి అశోక్ పద్మారావు డి రాజు సత్యనారాయణ అశోక్ వెంకటేష్ ముదిరాజ్ లక్ష్మణ్ శీను సుధీర్ ఉమాపతి పాషా దుర్గం తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది