03-06-2025 12:08:54 AM
న్యూఢిల్లీ, జూన్ 2: భారత్లో ర హదారుల రంగం గతంలో ఎన్నడూ లేనంత జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2,07,00 కోట్లను రోడ్డు నిర్మాణం కోసం కేటాయించారు. 2016 ఆర్థిక సం వత్సరం మధ్య 9.3 శాతం వార్షిక వృద్ధితో ఈ రంగం దూసుకుపోయిం ది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే 12,349 కిలోమీటర్ల మేర రహ దారులు నిర్మించారు.
గతంలో ఎన్న డూ లేని విధంగా పనులు సాగడం తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల జాబితాలో రెండో స్థానానికి దూసుకు పోయింది. హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో రోడ్లు నిర్మి స్తూ ప్రభుత్వానికి భారం కాకుండా చూసుకుంటున్నారు.
ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన ద్వారా గ్రామీ ణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాలు మె రుగుపడ్డాయి. ఇప్పటికే 7,65,600 కి.మీ మేర రహదారులు నిర్మించా రు. నాలుగో దశలో 25,000 గ్రామీ ణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయా లు కల్పించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో పలు సవాళ్లు కూ డా దాగి ఉన్నాయి. రోడ్లకు అవసరం అయిన భూమిని సేకరించడం ప్రధా న సవాల్గా మారింది.