03-06-2025 12:10:52 AM
2033 నాటికి 6.68 లక్షల కోట్లకు
న్యూఢిల్లీ, జూన్ 2: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మైక్రోఫైనాన్స్ రం గం కీలకపాత్ర పోషిస్తోంది. తక్కువ ఆదాయ కుటుంబాలు, మహిళలు, గ్రామీణ ప్రజలకు మైక్రోఫైనాన్స్ సం స్థలు (ఎంఎఫ్ఐ) సులభంగా రుణా లు మంజూరు చేస్తూ సహాయం చే స్తున్నాయి. మహమ్మారి దెబ్బ తర్వా త ఈ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఎంఎఫ్ఐలు పుంజుకున్నాయి.
భారతదేశంలో ఎంఎఫ్ఐల వార్షిక వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదై.. 2033 చివరినాటికి రూ. 6,68,000 కోట్ల కు చేరుకుంటుందని అంచనా. గడిచిన ఐదేండ్లుగా ఈ రంగం 18 శాతం పైచిలుకు వృద్ధి సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31 2024 వరకు ఈ రంగం మొత్తం రు ణాల విలువ రూ. 3,48,015 కోట్లు (41.4 బిలియన్ అమెరికన్ డాలర్లు) గా ఉంది. స్వయం సహాయక బృం దాలకు ఈ సెక్టార్ అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేస్తోంది.