calender_icon.png 25 June, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీళ్లకు మళ్లని సీతారామ జలాలు..

24-06-2025 10:17:45 PM

ముగ్గురు మంత్రులు ఉన్న పంటలకు దక్కని చుక్క నీరు

ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పిండ ప్రధాన  కార్యక్రమం

ఆంధ్ర రైతాంగానికి సాగునీరు అందిస్తే చూస్తూ ఊరుకోం..

బీఆర్ఎస్  జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..

మణుగూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా గిరిజన ప్రాంత రైతాంగానికి అడుగు అడుగున అన్యాయం జరుగుతుందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(BRS District President Rega Kantha Rao) విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి చుక్క నీరు అందించకుండా మంత్రులు తమ నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించడానికి పోటీపడుతున్నారని మండిపడ్డారు.

భద్రాద్రి జిల్లా రైతుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతమ్మ సాగర్ బహులార్ధక ప్రాజెక్టును నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10  లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం సంకల్పిస్తే నేడు కాంగ్రెస్ పాలనలో చెంతనే గోదావరి ఉన్న భద్రాద్రి జిల్లాలోని  పంట పొలాలకు చుక్క సాగునీరు  అందించకుండా గోదావరి జలాలను  తమ ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తూ గిరిజన రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

ఏజెన్సీలోని రైతులకు .. జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసిన ప్రాజెక్టుకు హెలికాప్టర్లు పర్యటనతో మంత్రులు  హడావిడి చేస్తూ ప్రారంభోత్సవాలకు పోటీ పడుతున్నారని దీనికి వారు సిగ్గుపడాలన్నారు. జిల్లా రైతాంగానికి వ్యతిరేకంగా  ప్రభుత్వ చర్యలు నిర్వహిస్తూ  హడావుడిగా మంత్రులు, శంకుస్థాపన చేసిన పూసగూడెం వద్ద  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  ఈనెల 30వ తారీఖున  పెద్ద ఎత్తున కార్యకర్తలతో నిరసన కార్యక్రమాన్ని  చేపడతామని హెచ్చరించారు. ప్రతి కార్యకర్త ఓ పూలదండ తో తరలివచ్చి శిలాఫలకం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు నివాళి అర్పించి ఖమ్మం జిల్లాకు తరలి వెళ్లే గోదావరి జలాలలో పిండ ప్రధానం కార్యక్రమాన్ని చేపడతామన్నారు. దీనికి జిల్లా పార్టీ శ్రేణులు, నాయకులు, పెద్ద ఎత్తున  తరలివచ్చి కార్యక్రమాన్ని విజయం చేయాలని విజ్ఞప్తిచేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని, కేవలం స్థానిక సంస్థలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రైతు భరోసా అందించిందని విమర్శించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రతి చెరువు గోదావరి జలాలతో కలకలలాడిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులు కుంటలు ఎండిపోయి ఎక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కుంట లక్ష్మణ్, మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, తుర్కా రామకోటి, బోసెట్టి రవి, తదితరులు పాల్గొన్నారు.