calender_icon.png 1 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వినతి

30-05-2025 01:35:38 AM

కొత్తపల్లి, మే 29 (విజయ క్రాంతి): నగరంలోని కోతిరాంపూర్ లో డంపింగ్ యా ర్డ్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. 

గురువారం కరీంనగర్ సమీక్ష సమావేశానికి వచ్చిన కరీంనగర్ జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు లను   స్పోరట్స్ స్కూల్ హెలిపాడ్ గ్రౌండ్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టేల భూమయ్య, బత్తిని కన్నయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్  గడ్డం విలాస్ రెడ్డి, ఆది జలపతి, గంట వాసు, దేవుని పట్నం తిరుపతి, కొంకటి హరీష్, మూల వినయ్ గౌడ్, రమా, బత్తిని చంద్రయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.