30-05-2025 01:40:33 AM
మేడ్చల్ జిల్లాలో ‘జైహింద్ ర్యాలీ’
కాల్పుల విరమణపై అఖిలపక్షం ఏర్పాటు అవసరం లేదా?
కుత్బుల్లాపూర్, మే 29 (విజయక్రాంతి): ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే ప్రధాని మోదీ పాకిస్థాన్తో యుద్ధం ఆపేశారు. మీకు వీరతిలకం దిద్దిపంపితే, ఆయన మధ్యలోనే యుద్ధం ఆపి సైనికుల ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీశారు. బీజేపీ ప్రభుత్వానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి తెచ్చే శక్తి లేదు. పాక్ నుంచి బలూచిస్థాన్ను విడగొట్టే ధైర్యం లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పాక్తో కాల్పుల విరమణపై అఖిల పక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేని నిలదీశారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ చౌరస్తాలో కాంగ్రెస్పార్టీ చేపట్టిన ‘జైహింద్ ర్యాలీ’లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ సాగింది.
అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. 1971లో భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో అమెరికా పాక్ పక్షాన నిలిచిందని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో ధైర్యంగా ‘నేను యుద్ధాన్ని ఆపను.. నాకు నా దేశాన్ని ఎలా రక్షించుకోవాలనేది తెలుసు’ అని చెప్పి పాక్ను రెండుగా విడ గొట్టారని గుర్తుచేశారు. అలా ఏర్పడిన దేశమే బంగ్లాదేశ్ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశ గౌరవాన్ని ట్రంప్ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
పాక్ భూభాగంలో భారత్కు చెందిన ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయో దేశ పౌరులకు చెప్పాలని డిమాం డ్ చేశారు. పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత తాము కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలు స్తూ మద్దతు తెలిపామన్నారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు తమ పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే బేషరతుగా కేంద్ర ప్రభుత్వానికి మ ద్దతు నిలిచారని కొనియాడారు. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ ఆపమనగానే మోదీ అం దుకు అంగీకరించి, ఆ తర్వాత మౌనం వహించడం సరికాదని దుయ్యబట్టారు.
గుండెల్లో ధైర్యం ఉన్నవా డే యుద్ధాన్ని గెలిపించగలడని, అలాంటి ధైర్యము న్న నేత రాహుల్గాంధీ అని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన జవాన్ సంతోశ్బాబుని చైనా సైన్యం పొట్టనపెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ ఎన్నికల కోసం కాదని, ఓట్ల కో సం అంతకంటే కాదని, దేశ సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకేనని స్పష్టం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోయానని, తర్వాత కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం తనను ఎంపీగా గెలిపిం చుకున్నదని గుర్తుచేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్రె డ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ సెగ్మెంట్ ఇన్చార్జ్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, బె ల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కుమార్, కంటోన్మెం ట్ ఎమ్మెల్యే గణేశ్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, అమీర్ అలీఖాన్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్రెడ్డి, పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొలను హ న్మంతరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఇతర నేత లు ఉజ్మా షకీర్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, వజ్రేశ్యాదవ్, పరమేశ్వర్రెడ్డి, బండి రమేశ్, బొంగునూరి శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, కిశోర్రెడ్డి పాల్గొన్నారు.