2 April, 2026 | 2:58 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

రైతులకు న్యాయం చేయాలని సీఎంకు వినతి

19-09-2025 12:56 AM

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ

ఆమనగల్లు, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ లో  భూములు కోల్పోతున్న  రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

రీజినల్ రింగ్ రోడ్డు అలైట్మెంట్ మార్పులో  భాగంగా భూములు కోల్పోతున్న మాడుగుల, అమనగల్, తలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు  చెందిన రైతులు  ఇటీవల నిర్వహిస్తున్న ఆందోళనలు నిరసన కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. హైదరాబాద్ సమీపంలో భూములకు విలువ మార్కెట్లో బాగా పెరిగిందని  భూములు కోల్పోయే రైతులకు నష్టం కలగకుండా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యేకు హామీ నిచ్చారు.  అనంతరం కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలను కలిపే ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణ కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతిపత్రం అందజేశారు.