calender_icon.png 9 June, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ.. రియల్ మార్కెట్ 48 శాతం వృద్ధి

04-08-2024 01:07:30 AM

2024లో 5.3 లక్షల యూనిట్లకు చేరుతుంది

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్ ఇండియా అంచనా 

భారత్‌లోని టాప్ 7 నగరాల్లో మొదటి క్వార్టర్‌లో జరిగిన ఇండ్ల అమ్మకాలు, ప్రారంభోత్సవాలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి): దేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ రియల్ గ్రోత్ 48 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం వృద్ధితో ఆల్‌టైం గరిష్ఠానికి చేరుకుంది. గృహ అమ్మకాలు రూ.3.47 లక్షల కోట్లకు (42 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. స్థిరాస్తి రంగం హౌసింగ్ యూనిట్ పూర్తి చేయడంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకోవడంతోపాటు 2018లో 2.3 లక్షల యూనిట్ల నుంచి 2023లో ఏకంగా 4.35 లక్షల యూనిట్లకు చేరుకుంది.

2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.3 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్ ఇండియా సంస్థ అంచనా వేసింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలపడటం, అధిక పట్టణీకరణతో దేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ మంచి వృద్ధిని నమో దు చేసుకుంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. కార్భన ఉద్గారాలను తగ్గించడానికి, సుస్థిరతను తగ్గించడానికి ఇంటి యజమానులు పచ్చని నివాస ప్రాజెక్టులతోపాటు మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారని వెల్లడిం చింది. గడిచిన కొద్ది రోజులుగా దేశ రియల్ ఎస్టేట్ మంచి వృద్ధిని నమోదు చేసుకుందని, 2017లో 120 బిలియన్ డాలర్ల మార్కెట్ జరిగితే, 2022లో 477 బిలియన్ డాలర్లకు చేరిందని, నరెడ్కో అంచనా ప్రకారం 2030 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆ నివేదికలో వెల్లడించింది. 

క్రమంగా పెరుగుతున్న డిమాండ్

కొత్త గృహాల డిమాండ్ 2034 నాటికి 906 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రెసిడెన్షియల్ రియల్ ఎస్టే ట్ సెక్టార్ ఇన్ ఇండియా అంచనా వేసిం ది. దేశంలో గృహాల అమ్మకాలు 2023 లో టాప్ 8 నగరాల్లో 5 శాతం వృద్ధితో 3,29,907 యూనిట్లకు చేరనున్నట్టు తెలిపింది. 2023లో రెసిడెన్షియల్ యూనిట్ల లాంచింగ్ 7 శాతం వృద్ధితో 3,50,746 యూనిట్లకు చేరిందని, టాప్ 7 నగరాల్లో గృహాల అమ్మకాలు 4,76,530 యూనిట్లతో గరిష్ఠస్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక పేర్కొన్నది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత రెసిడెన్షియల్ ప్రాపర్టీ రంగం రూ.3.47 లక్షల కోట్లతో 48 శాతం వృద్ధితో ఆల్‌టైం ఇంటి అమ్మకాల విలువను నమోదు చేసుకుందని, దీంతో సగటు గృహాల ధరలు 25 60 శాతం పెరిగాయని వెల్లడించింది. ఇందులో ముంబై రీజియన్ అత్యధికంగా 86,871 రెసిడెన్షియల్ అమ్మకాలను నమోదు చేసు కుందని తెలిపింది.

ఆ తర్వాత బెంగళూరులో 54,046, పుణెలో 13 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిపింది. సీఐఐ ప్రకారం భారత్ రియల్ ఎస్టేట్ రంగం 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. 2034 నాటికి దేశ జీడీపీ 10.5 శాతం అయ్యేందుకు దోహదపడుతుందని, మొత్తం ఆర్థిక వృద్ధిలో 7.3 శాతం రియల్ ఎస్టేట్ రంగం నుంచే లభిస్తుందని ఈ నివేదికలో వెల్లడించింది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త గృహాలకు డిమాండ్ భారీగా పెరుగుతోందని, 2024 నుంచి 2034 మధ్య కాలంలో 7.8 కోట్ల మంది కొత్త ఇండ్లను కొనుగోలు చేస్తారని, లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్లకు డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. లగ్జరీ యూనిట్ల అమ్మకాల్లో ముంబై 93,051 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందని, వృద్ధిలో మాత్రం కోల్‌క తా 28 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని తెలిపింది. దేశంలో డిమాండ్‌కు సరిపడా యూనిట్ల సరఫరా ఉందని చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కారణంగా 2036 నాటికి 93 మిలియన్ యూనిట్ల ఇండ్ల అమ్మకాలు జరుగుతాయని తెలిపింది. 

భారీగా పెరుగుతున్న ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. స్థిరమైన వడ్డీ రేట్లతోపాటు దేశ ఆర్థిక వృద్ధితోపాటు వ్యయం పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది. రెసిడెన్సియల్ ప్రాపర్టీలకు దేశంలో డిమాండ్ ఉన్నదని, 2023 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించినట్టు పేర్కొన్నది. నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారం 2022 జనవరి జూన్‌లో 55 శాతం వృద్ధితో ముంబైలో 44,200 యూనిట్ల అమ్మకాలు జరిగాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో 23 శాతం వృద్ధితో 14,693 యూనిట్ల అమ్మకాలై నట్టు పేర్కొన్నది. అన్ని యూనిట్లలోనూ 3 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొన్నట్టు చెప్పింది. 

2024లో 21శాతం వృద్ధి

2024 క్యూ 1లో భారత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 21 శాతం వృద్ధితో 1.0 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్ ఇండియా నివేదికలో తెలిపింది. 2022  ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయ సంస్థల వాటా 24 శాతానికి చేరుకున్నదని తెలిపింది. అయి తే మొత్తం పెట్టుబడులు మాత్రం 55 శాతం ఉన్నాయని వివరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం 2 కోట్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించారని తెలిపింది.

2024 వార్షిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.80,671 కోట్లకు ప్రభుత్వం పెంచిందని వెల్లడించింది. 2023 రూ.79,590 కోట్లతో పోల్చితే ప్రస్తుత బడ్జెట్ హౌసింగ్, రియల్టీకి సానుకూల దృక్ఫథాన్ని సూచిస్తుందని, ప్రభుత్వ రంగం గృహ నిర్మాణ రంగం వృద్ధికి ఇది ఊతమిచ్చినట్టు అవుతుందని తెలిపింది. మౌలిక సదుపాయాలపై వ్యయం పెంచడం కూడా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చినట్టు అవుతుందని వివరించింది. ప్రభుత్వ సంస్కరణల కారణంగా దేశం లో రియల్ వృద్ధి గణనీయంగా పెరుగుతోందని ఈ నివేదిక పేర్కొన్నది.

భారత్‌లోని టాప్ 7 నగరాల్లో సేల్స్ ట్రెండ్

 సీటీ క్యూ1 2024 క్యూ4 2023 క్యూ1 2023 శాతం మార్పూ

 ఎన్‌సీఆర్ 15,650 16,100 17,20-0 ----------3% ----------9%

 ఎమ్‌ఎమ్‌ఆర్ 42,900 42,600 34,700 1% 24%

 బెంగళూర్ 17,800 16,900 15,700 5% 13%

 పూణే 23,000 23,200 19,900 -1 16%

 హైదరాబాద్ 19,700 17,500 14,300 13% 38%

 చెన్నై 5,500 5,300 5,900 4% -7  

 కోల్‌కత్తా 5,600 5,700 6,200 -2% -10%