11-11-2024 12:59:09 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): మత్స్యకారుల అభ్యున్నతికి రేవంత్ సర్కార్ కృషి చేస్తోందని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. పదేండ్ల కాలంలో చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.
నూతన పాలసీ తెచ్చే క్రమంలో చేపల పెంపకం, విక్రయాల అధ్యయనం కోసం తన ఆధ్వ ర్యంలో నేటి నుంచి 13 వరకు బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో మూడు రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఆదర్శవంతమైన పాలసీ ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు.