7 May, 2026 | 10:24 PM

మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి సీఎం రేవంత్ నివాళి

27-12-2024 03:44 PM

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), మరికొందరు కేబినెట్ మంత్రులు బెళగావిలో ఉన్నారు. భారతదేశ ఆర్థిక సంస్కరణల కార్యక్రమ రూపశిల్పిగా పిలువబడే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం మరణించారు. ఆయనకు 92 ఏళ్లు.