11-10-2025 12:00:00 AM
మేడిపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : 5 సంవత్సరాల్లోపు పిల్లలకు బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు చెంగిచర్లలో (02), బోడుప్పల్లో (17) పీహెచ్సీ కేంద్రాల్లో అక్టోబర్ 12న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పా ట్ల పై శుక్రవారం బోడుప్పల్ కమీషనర్ శైలజా మెడికల్ ఆఫీస ర్స్, మునిసిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, పారిశుద్ధ్య సిబ్బందితో అవసర మైన ఏర్పాట్లు, సదుపాయలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, మేనేజర్ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.