16-06-2025 10:36:40 PM
టేకులపల్లి (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని టేకులపల్లి మండలం కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య(Area General Manager V. Krishnaiah) క్వాలిటీ బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ.. బొగ్గు అధిక ఉత్పత్తి, రక్షణతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమని అన్నారు. నాణ్యమైన బోగ్గు ఉత్పత్తి చేయడంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంటుందన్నారు.
బొగ్గు నాణ్యతలో సూపర్వైజర్ లే కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో క్వాలిటీ బొగ్గు రావాలని క్వాలిటీ బొగ్గు లేకపోతే ఇల్లందుకు మనుగడ లేదని, కాబట్టి అందరూ సమిష్టి కృషితో నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె ఓ సి పి.ఓ. గోవిందరావు, క్వాలిటీ మేనేజర్ రాందాస్, ఇంచార్జి మేనేజర్ కె. ఓ. సి. యూ.బ్రహ్మం, అన్ని షిఫ్టుల అండర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, సంబంధిత ఉద్యోగులు పాల్గొన్నారు.