16-06-2025 10:39:07 PM
చౌటుప్పల్ (విజయక్రాంతి): భారతీయ ప్రాచీన హస్తకళలు అద్భుతమనీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు(Trainee IAS officers) అన్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం టెక్స్ టైల్ పార్కులోని మినీ క్రాప్స్ హస్తకళల కేంద్రాన్ని ఐదు రాష్ట్రాలకు చెందిన సౌరబ్ శర్మ, సలోని చాబ్రా, హర్ష చౌదరి, కర్లాన్ చిగ్తి యాన్వి, కొయ్యడా ప్రణయ్ కుమార్ లు సందర్శించారు. భారతీయ ప్రాచీన హస్తకళలైనా బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ బాతిక్ ప్రింటింగ్, టై అండ్ డై పద్ధతిలో నూలు వస్త్రాలను తయారు చేసే పద్ధతిని పరిశీలించారు.
తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2024 ట్రైనీ ఐఏఎస్ ల బృందం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణలో తెలంగాణ దర్శన్ లో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలో ఇక్కడికి వచ్చారు.పర్యావరణానికి హాని కలగకుండా నూలుతో తయారైన వస్త్రాలపై, ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో తయారైన వస్త్రాలు ధరించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి సైతం మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రాచీన భారతీయ హస్తకళలకు పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో టెక్స్టైల్ పార్కులో మిమి క్రాఫ్ట్స్ పేరుతో హస్తకళల కేంద్రాన్ని ప్రారంభించామని మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నామని ఈ కేంద్రం వ్యవస్థాపకుడు ఫ్యాషన్ డిజైనర్ కే కృష్ణమూర్తి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నిర్వాహకురాలు పుష్పలత, మర్రి చెన్నారెడ్డి మానవ వరులు అభివృద్ధి సంస్థ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పెద్ద బోయిన, చేనేత జోలి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రామ్ రెడ్డి, మల్కాపురం పంచాయతీ కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.