26-05-2025 08:04:28 AM
తెలంగాణ ఆర్టిఐ కమిషనర్.. పి. వి శ్రీనివాస్.
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం(Right to Information Act) సామాన్యుడి చేతిలో వజ్రాయుధంలా పనిచేస్తుందని దీనిని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ఆర్టిఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టులు , ఆత్మీయుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ పౌర సన్మాన సభకు పివి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ బాయ్ స్థాయి నుంచి ఈరోజు తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ గా సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రస్తావించారు . ఎన్నో సమస్యలతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో 50% జనాభా నేటికీ ఉన్నారనేది వాస్తమ న్నారు . సామాన్యుడి గళానికి దక్కిన గౌరవమే ఈ సమాచార శాఖ ఆర్టిఐ కమిషనర్ పదవి అని సామాన్యుడు నుంచి సమస్యలు తీరే వరకు జవాబుదారీగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో సమాచార హక్కు చట్టాన్ని తీసుకువస్తానన్నారు.
తనపై ఎంతో నమ్మకంతో సమాచార హక్కు చట్ట కమిషనర్ గా ఇచ్చిన పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి పేరు తీసుకువస్తానన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాస్ సతీమణి సృజన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుండి నేడు ఆర్టిఐ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది, అంటూనే కుటుంబ బాధ్యతలకు సమయం కేటాయించలేడేమో అనిపిస్తుందని అన్నారు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ పై ఉన్న నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి జవాబుదారీగా ఉంటారని నమ్మకం ఉందని, ఉద్యమం నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పదవికి వన్నె తీసుకొస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా శ్రీనివాస్ అంతరంగాన్ని తెలియజేస్తూ ఆ చల్లని సముద్ర గర్భం అంటూ సృజన పాడిన పాట సభికులందరినీ ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు, వ్యాపారస్తులు జర్నలిస్టులు ఇతర వర్గాల ప్రజలు పివి శ్రీనివాస్ ఆత్మీయులు ఈ ఆత్మీయ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా తెలంగాణ రాష్ట్రంలో సరైన వ్యక్తికి ఉద్యమ నాయకుడికి దక్కిన గౌరవం అని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీవీ శ్రీనివాస్ పేరు తెలియని వారు లేదంటే అతిశయోక్తి కాదని మాట్లాడారు. అటు కేసీఆర్ హయాంలో అలుపెరుగని పోరాట ధీరుడుగా ఒకపక్క నికార్సైన జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూనే తెలంగాణ ఉద్యమానికి తిరుగులేని పాత్ర పోషించారు.. ఐజెయు జాతీయ నాయకులు దుద్దుకూరి రామారావు అధ్యక్షత వహించి పీవీ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. టియుడబ్ల్యూజే ఐ జే యు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన పీవీ శ్రీనివాస్ భద్రాద్రి రామయ్యనే ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటూ ఎదిరించి మాట్లాడిన కంచర్ల గోపన్నలా సమాజం కోసం పోరాటం చేశారని ధిక్కరించిన స్వరానికి దక్కిన గౌరవమే ఆర్టిఐ కమిషనర్ పదవి అని అన్నారు. టీజేఎఫ్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన నిలిచిన వ్యక్తికి సరైన గౌరవం దక్కిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, కోనేరు చిన్ని, సింగరేణి ఎడ్యుకేషన్ సెక్రటరీ గుండా శ్రీనివాస్, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షులు ఆకునూరి కనకరాజు, మధువన్ వ్యాపార సంస్థల అధినేత కాకొల్లు నాగేశ్వరరావు, బిజెపి నాయకులు జీవీకే మనోహర్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మల్లెల రామనాథం, సీనియర్ నాయకులు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జేవిఎస్ చౌదరి, మాచవరపు కోటేశ్వరరావు, చైతన్య కృష్ణ, భరత్, సింగరేణి ఎస్సీ సెల్ నాయకులు అంతటి నాగేశ్వరరావు, సింగరేణి లైసన్ ఆఫీసర్ కలువల చంద్రశేఖర్, రుద్రంపూర్ జేఏసీ నాయకులు యాకయ్య, అనుదీప్, పొగరు రాజశేఖర్, బండి రాజు గౌడ్ , కోదాడ శ్రీనివాసరావు, జర్నలిస్టు సంఘాల నాయకులు చంద్ర నరసింహారావు, వట్టి కొండ రవి, ఏర్పుల సుధాకర్ రావు, ఎర్రా ఈశ్వర్, సీనియర్ పాత్రికేయులు ఎండి వాహబ్, గుణ సురేష్ ,లక్కీ లక్ష్మణ్, అశోక్, వీరు నాయక్, క్రాంతి కుమార్, నాగేశ్వరరావు, కోలా కుమార్, జంపన్న, మురళి, పురం శ్రీనివాస్, జాన్సన్ బాబు, భూపేష్, చాందు రత్న కుమార్ , లక్ష్మణరావు, పురుషోత్తం, కంచు శ్రీను, వినోద్, రామారావు, గీత మధు తదితరులు పాల్గొన్నారు.