calender_icon.png 3 June, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్‌నగర్ ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

01-06-2025 12:24:26 PM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లోని ఎస్‌బీఐ(State Bank of India) ఏటీఎంలో(Huzurnagar SBI ATM) శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి కారులో వచ్చి ఏటీఎంను ధ్యంసం చేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఏటీఎం మెషీన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి రూ. 20 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఫార్చునర్ వాహనాల్లో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్ అంతా తీసుకుని ఏటీఎం మెషీన్(Automated teller machine) ను కాల్చివేశారని పోలీసులకు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ చోరీకి పాల్పడిన నిందితులను తప్పకుండా అరెస్ట్  చేస్తామని పోలీసులు వెల్లడించారు.