26 April, 2026 | 1:25 AM

ఆర్టీసీ కార్మికుల సంబురాలు

26-04-2026 12:00 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం కావడంతో శనివారం ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. బండ్లగూడ, హయత్ నగర్ డిపోలో మూడు రోజులుగా సమస్యల సాధనకై సమ్మె చేస్తున్న సందర్భంలో కార్మికుల డిమాండ్లను మంత్రుల కమిటీ నెరవేర్చడానికి అంగీకరించినందున బండ్లగూడ డిపోలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు తిరిపించుకుంటూ సం బురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగార్జున రెడ్డి, పాపయ్య, కిషన్, ఏఎస్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్  తోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.