15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఐరన్ మ్యాన్ స్మృతిలో రన్ ఫర్ యూనిటీ

01-11-2025 12:00 AM

 జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసుల క్రీడోత్సాహం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): దేశ తొలి ఉప ప్రధాని సర్థార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏక్తా దీవస్ సందర్బంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మనమంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలి ఐక్యతే బలం అనే థీమ్తో 2 కిలోమీటర్ల ప్రతీకాత్మక పరుగును మాధాపూర్ టీ-హబ్ గేట్ వద్ద నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాధాపూర్ డీసీపీ రితిరాజ్, ఐపీఎస్ శుభారంభం చేశారు. ఐక్యత, దేశభక్తి, సమన్వయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది పోలీసు సిబ్బంది, సిసిఎసి సభ్యులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సర్దార్ పటేల్ భారతీయ రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన దృఢసంకల్పం, నాయకత్వం ఈరోజు కూడా మనందరికీ ప్రేరణ.

గెలుపు కంటే పాల్గొనడమే ముఖ్యమని, ఏ పనినైనా పూర్తి చేయడం అంతే విలువైనదని గుర్తించాలి. మనం పరుగెత్తింది ఐక్యత కోసం నిలబడేది కూడా ఐక్యతకోసమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ దేశ సమైక్యతా శిల్పి పటేల్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని 562 సంస్థానాలను ఏకం చేసి భారత గణరాజ్యానికి బలమైన పునాది వేశారని రితిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధాపూర్ ఏడీసీపీ ఉదయ్రెడ్డి, ఏసీపీ చి. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్, మాధాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, సిసిఎసి సీఈఓ నావేద్ ఖాన్, ప్రాజెక్ట్ మేనేజర్ భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు.