16-06-2025 01:53:31 AM
అహ్మదాబాద్, జూన్ 15: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో మర ణించిన గుజరాత్ మాజీ సీఎం రూపాణీ మృతదేహాన్ని ఆదివారం గుర్తించి ఆయన కుటుంబసభ్యులకు అందించారు. ఇప్పటి వరకు 8౦ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపి గుర్తించగా.. ౩౩ మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
230 బృందాలు ఏర్పాటు
బాధిత కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్టు గుజరాత్ రిలీఫ్ కమిషనర్, రెవెన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు. మాజీ సీఎం మృతదేహాన్ని గుర్తించినట్టు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ పేర్కొన్నారు. విమానప్రమాదంలో మృతి చెందిన 11 మంది విదేశీయుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఆదివారం ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా విమానప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చికిత్స తీసుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా విమాన ప్రమాద స్థలంలో రెండో బ్లాక్ బాక్స్ లభించినట్టు వార్తలు వస్తున్నాయి.