19-06-2025 09:56:24 AM
తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు నిండిపోయ్యాయి. వెలుపల కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. బుధవారం ఏడుకొండవాడిని 80,440 మంది భక్తులు దర్శించుకొని, 33,687 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో హుండీకి 3.47 కోట్లు కానుకలు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.