calender_icon.png 19 June, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబటి రాంబాబుపై కేసు నమోదు

19-06-2025 10:29:12 AM

అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన వేళ అంబటి తన సోదరుడు మురళితో కలిసి దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే... సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. అనంతరం గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు ఆయన ర్యాలీ సాగింది.

ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో భారీ ఆంక్షలు విధించారు.  జగన్ వాహనంలతో పాటు మరికొన్ని వాహనాలు ముందుకు వెళ్లేందుకు వీలుగా పల్నాడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కొర్రపాడు శివారులోని ఓ పెట్రోల్ బంకు వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాలు ముందుకు వెళ్లేందుకు వెనుక ఉన్న వాహనాలు పోలీసులు ఆపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అంబటి రాంబాబు వాహనాలను ఎందుకు ఆపారని, వెంటనే పంపించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఏటుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారని, అంతేకాకుండా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది కాకుండా ఆపామని చెప్పిన కూడా వినిపించుకోలేదు. పోలీసులతో వాదించుకుంటూ, సోదరుడితో కలిసి రోడ్డుపై ఉన్న బారికేడ్లను నెట్టేశాడు. అడ్డుచెప్పిన పోలీసులపై నోరు పారేసుకుంటు వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ అంబటిపై సత్తెపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.