calender_icon.png 4 June, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

02-06-2025 08:03:41 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్స్ అన్నీ నిండిపోయి భక్తులు వెలుపల క్యూ లైన్ ల వరకు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. ఆదివారం 78,031 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న  32,936 మంది భక్తులు తలనీలాలు  సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది.

శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో ఆదివారంనాడు చిరుత కలకలం రేపింది. శ్రీవారి మెట్ల(Srivari Mettu) మార్గంలో 500 మెట్టు దగ్గర చెట్లపొదల్లో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన భక్తులు సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సైరన్‌ మోగించి చిరుతను అడవిలోకి పంపారు. 

శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి( Srivari Temple) ఆలయంపై నుంచి నిన్న మరో మరో విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది. ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు సాగకూడదని ఆగమశాస్త్ర నిబంధనలు సూచిస్తున్నాయి. ఆలయంపై నుంచి వరసగా విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంపై నుంచి తరుచూ విమానాలు వెళ్తుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. తిరుమలను నోఫ్లై(Tirumala no-fly zone) జోన్‌గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుకోవాలని తిరుమల వెంకన్న భక్తులు కోరుతున్నారు.