01-11-2025 06:25:24 PM
శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్
గోదావరిఖని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో త్వరలోనే సదర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మొట్టమొదటిసారిగా గోదావరిఖనిలో సదర్ వేడుకలు ప్రారంభించామని, ఈ ఏడు కూడా మన యాదవుల కోరిక మేరకు మళ్లీ గోదావరిఖనిలో యాదవుల సహకారంతో పెద్దఎత్తున సదర్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీధర్ యాదవ్ తెలిపారు. ఈ సదర్ వేడుకలకు జిల్లాలోని, గోదావరిఖనిలోని యాదవులు సహాయక సహకారాలు అందించాలని ఆయన ప్రకటనలో కోరారు.