calender_icon.png 29 September, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతితో మానవ అనుబంధాన్ని గుర్తు చేసే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ

29-09-2025 07:29:29 PM

డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రం మండల పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడపడుచులతో కోలాటం ఆడటం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ అని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ పాల్గొనీ పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తుచేసే వినూత్నమైన పండుగ బతుకమ్మ అని అన్నారు.

మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైన అంశాలన్నింటినీ పాట రూపంలో ఆలపించే అద్భుత ఘట్టం బతుకమ్మ సొంతమని అన్నారు. ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ బతుకమ్మ అంటే తెలంగాణ అస్తిత్వం అనడంలో మాత్రం అతిశయోక్తి లేదని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమలతో పాటు చీరలను వాయినంగా అందజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా నాయకులు మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.